ASBL NSL Infratech

వైరల్ అవుతున్న రేణు దేశాయ్ ట్వీట్...

వైరల్ అవుతున్న రేణు దేశాయ్ ట్వీట్...

ఆల్ టైం సూపర్ హిట్ సినిమా బద్రి బ్యూటీ రేణు దేశాయ్. టాలీవుడ్ హీరోయిన్ గా నే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఇండస్ట్రీకి రేణు సుపరిచితురాలు. పవన్ తో సూపర్ హిట్ కొట్టిన తర్వాత ప్రేమలో పడి ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని అనుకోని పరిస్థితుల్లో విడిపోయి ఫాన్స్ ని డిజప్పాయింట్ చేసారు పవన్, రేణు. వీరికి అకిరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తర్వాత పిల్లలతో సపరేట్ గా ఉంటుంది రేణు దేశాయ్.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఈ బద్రి భామ. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రం తో మరోసారి వెండితెరపై కనిపించబోతుంది రేణు దేశాయ్. అప్పుడప్పుడు బుల్లితెర షోస్ లో జడ్జిగా మెరిసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ పిల్లల అప్ డేట్స్ షేర్ చేస్తుంటారు రేణు దేశాయ్. తన హ్యాపీ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ తరుణంలో రీసెంట్ గా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం అభిమానులని కలవరపెడ్తుంది.

గత కొన్నాళ్లుగా గుండె సంబంధిన సమస్యలతో పోరాడుతున్నానంటూ ఈ హీరోయిన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. " గుండె మరియు ఇతర అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా నేను పోరాడుతున్నాను, వాటిని ఎదుర్కునే శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వాళ్ళుంటే దైర్యంగా ఉండండి. మీలో దైర్యం నింపడానికే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను " అంటూ రేణు దేశాయ్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను మెడికేషన్లో ఉన్నట్టు, త్వరలోనే కోలుకొని షూటింగ్స్ లో పాల్గొంటానని రేణు దేశాయ్ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :