కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం... అందరికీ ఉచితమే
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోన్న వేళ వ్యాక్సినేషన్ ను 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసు ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రికాషన్ డోసు పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపాయి.
Tags :