కరోనా వైరస్ ను చంపేసే మాస్కు
కొవిడ్ వ్యాప్తిని అరికట్టడమే కాదు, కొవిడ్ను పూర్తిగా నాశనం చేయగల కొత్తరకం మాస్క్ను అమెరికాకు చెందిన పరిశోధకులు రూపొందించారు. ఈ మాస్క్ ఎక్కువ కాలం మన్నికగ ఉండటమే కాక ఎక్కువ మార్చవలసిన అవసరం లేదని, స్వీయ క్రిమిరహిత శక్తిని కలిగి ఉంటుందని అమెరికాలోని రెనెస్సేలేర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఎడ్మండ్ పాలెర్మో వెల్లడించారు. జర్నల్ అప్లయిడ్ ఎసిఎస్ మెటీరియల్స్లో ఈ పరిశోధన వెలువడింది. పరిశోధక బృందం విజయవంతంగా విస్తృతమైన స్పెక్ట్రమ్ యాంటీ మైక్రోబియల్ పాలిమర్స్ (సూక్ష్మ జీవులను నాశనం చేసే పాలిమర్స్)ను ఎన్95 మాస్క్లు రసాయానిక మార్పులకు గురవుతుంటాయని, సూక్ష్మ జీవుల వడపోతలో సరిగ్గా పనిచేయవని అందువల్ల అవి చాలాకాలం మన్నికగా ఉండవని పాత మాస్కుల గురించి చెప్పారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కూడా ఈ పరిశోధనలో పాలు పంచుకున్నారు.