బీజేపీ ఆ పని చేస్తే... నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటేనే జూటా పార్టీ అని మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. తెలంగాణను బీట్ చేసే మగాడు ఎవరూ లేరని పేర్కొన్నారు. కేసీఆర్కు ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలన్నారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కేసీఆర్ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానన్నారు. దసరా రోజు భద్రకాళిని కేసీఆర్ దర్శించుకుంటారని అమ్మవారిని మొక్కి దేశ రాజకీయాల కోసం బయల్దేరుతారన్నారు. కేసీఆర్ దేశ్కీ నేత అని ప్రధాని కావాలని పేర్కొన్నారు.
Tags :