మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా
తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, అయినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తప్పనిరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంత్రి కరోనా బారినపడడం ఇది రెండోసారి. గత ఏడాది అక్టోబర్లో కొవిడ్ బారినపడ్డారు.
Tags :