ASBL NSL Infratech

సత్య నాదెళ్ల కీలక ప్రకటన ...ఈ ఏడాది చివరికి భారత్ లో

సత్య నాదెళ్ల కీలక ప్రకటన ...ఈ ఏడాది చివరికి భారత్ లో

ఈ ఏడాది చివరికి భారత్‌లో 75 వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూర్‌ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తున్న కోడ్‌ విత్‌ అవుట్‌ బ్యారియర్స్‌ ప్రోగ్రామ్‌ గురించి నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోగ్రామ్‌ను భారత్‌లోనూ చేపట్టాలని నిర్ణయించాం. దీనిద్వారా 2024 చివరికి 75 వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నాం. ఈ నెల నుంచే దీన్ని ఆరంభించనున్నాం. దీంతో మహిళా డెవలపర్లు, కోడర్లు, టెక్నికల్‌ రోల్స్‌లో పనిచేసే యువతులకు మరిన్ని నెట్‌వర్కింగ్‌ అవకాశాలు లభిస్తాయి అని ఆయన వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :