ASBL NSL Infratech

13 రాష్ట్రాలకు రేపే రెండో దశ పోలింగ్ 

13 రాష్ట్రాలకు రేపే రెండో దశ పోలింగ్ 

లోక్‌సభ ఎన్నికల్లో రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించను న్నారు. 

వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగుతోంది. ఎందుకంటే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చని పోయారు. 

దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది. రెండో విడతకు సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రమే ముగిసింది. పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పొలింగ్ స‌మ‌యం పెంపు ..

ఎండలు, వడగాలుల ప్రభా వం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమ యాన్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధే పురా స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. 

అయితే.. ఎండల కార‌ణం గా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగిం చారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరి యాలోని 299, మాధేపు రాలోని 207, బంకాలోని 363 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఏ ఏ రాష్ట్రాల్లో అంటే?

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలు, కర్నాటక- 14, రాజస్థాన్‌- 13, మహారాష్ట్ర- 8, ఉత్తర్ప్రదేశ్‌- 8, మధ్య ప్రదేశ్‌- 6, అసోం, బిహార్‌ లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లోని చెరో స్థానానికి పోలింగ్ జరగనుంది.

 

- జి.సురేందర్, భూవిజన్ న్యూస్ 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :