ASBL NSL Infratech

ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ నుంచి 80 శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని ఆరోపించారు.  పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయన్నారు.  జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :