ASBL NSL Infratech

అమెరికా వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

అమెరికా వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వైద్య పరీక్షల కోసం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంటన ఆయన భార్య, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. 2018లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌ ఆసక్తికర ప్రకటన చేశారు. తాను రాష్ట్రంలో లేనప్పటికీ ఎవరికీ బాధ్యతలు అప్పగించబోవడం లేదని స్పష్టం చేశారు. అమెరికా నుంచే పారిపాలిస్తానని, అందుకోసం టెక్నాలజీ ఉపయోగిస్తానని వెల్ల డించారు. ఆసుపత్రిలో బెడ్‌ పై ఉన్నాగానీ పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.  గతంలో అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈసారి మాత్రం విదేశీ గడ్డపై నుంచే పాలన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.  ఈ నెల 29 నుంచి అమెరికా నుంచి భారత్‌ తిరిగి రానున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :