మీ సంతోషానికే తప్ప నా కోసం కాదు : స్వర్ణలత
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరిగాయి. బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడం లేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడం లేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీకళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తునాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను అని అన్నారు. నా విగ్రహ ప్రతిష్ఠ ఏడాదిలోపు చేయండి. ఎలాంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. పిల్లలు, స్త్రీలు, గర్భిణిలకు ఎలాంటి ఆపదా రానివ్వను. నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని అన్నారు.