ASBL NSL Infratech

ఆ రూ.15 లక్షలు ఎప్పుడు వేస్తారు? : జగ్గారెడ్డి

ఆ రూ.15 లక్షలు ఎప్పుడు వేస్తారు? : జగ్గారెడ్డి

ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను ఎప్పుడు వేస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు జమచేసే వరకు తాము ఇలానే ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధికి స్పెషల్‌ ప్యాకేజీ అడిగే ప్రయత్నం చేసారా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. బండి మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, హిందు, ముస్లిం, క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :