మే 10 నాటికి తమ దేశంలోని భారత్ బలగాలు వెనక్కి!
ఈ ఏడాది మే 10 నాటికి తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపిస్తామని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మార్చి 10 కంటే ముందు మొదటి గ్రూపు ఉపసంహరణ జరుగుతుందని, మే 10వ తేదీలోగా మిగతా రెండు వైమానిక స్థావరాల్లోని రెండు గ్రూపుల బలగాలు వెనక్కు వెళ్తాయని, ఈ మేరకు రెండు దేశాల మధ్య జరిగిన తాజా దౌత్య చర్చల్లో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఆ దేశ పార్లమెంట్లో ఆయన మొదటిసారిగా ప్రసంగించారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ దేశం లోని 88 మంది సైనికులను భారత్ ఉపసంహకరించుకోవాలని కోరారు.
Tags :