ఐరాసకు భారత్ రూ.2,739 కోట్ల విరాళం
అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస) 2024 వార్షిక బడ్జెట్కు భారత దేశం నుంచి సుమారు రూ.2,730 కోట్ల (32.89 మిలియన్ డాలర్ల)ను విరాళంగా అందజేసింది. సకాలంలో ఐరాస బడ్జెట్కు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన నిలిచింది. జనవరి 31వ తేదీ కల్లా ఈ దేశాలు తమ విరాళం మొత్తాలను పూర్తిస్థాయిలో అందజేశామని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజరిక్ తెలిపారు.
Tags :