మేం కాదు.. మీరే జోక్యంచేసుకుంటున్నారు
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం గురించి ఆ దేశం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో వేలు పెట్టడం తమ విధానం కాదని స్పష్టం చేసింది. నిజానికి కెనడాయే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని కనడా మీడియాలో వార్తలు రావడంతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు స్పందించారు.
Tags :