తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్కు, రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్గా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ద ప్రకాశ్ను నియమించింది. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేయగా, ఔషధ నియంత్రణ సంచాలకులుగా రిజ్వీకి అదనపు బాధ్యతలు, జీడీఏ కార్యదర్శిగా వీ శేషాద్రికి అదనపు బాధ్యతలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Tags :