వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై.. వాలంటీర్ ఆనందబాబు పోటీ
వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై ఓ వాలంటీరు పోటికి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్బాబు అనే వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఐదేళ్లలో ఎంపీ సురేశ్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకాల్ని భరించలేకే పోటికి దిగినట్లు తెలిపారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడిపే సురేశ్ బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధికోసం ఉద్దండరాయునిపాలెంలోని ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :