హుజురాబాద్ లేదా గజ్వేల్ ఎక్కడైనా సరే.. తాను సిద్ధం
సీఎం కేసీఆర్పై హుజురాబాద్ లేదా గజ్వేల్ ఎక్కడైనా సరే తాను ఫోటీకి సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను ఓడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకు అర్థం లేదని మరోసారి ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ కంటే వేగంగా దూసుకుపోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్ గడ్డపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కంటే తనకే ఎక్కువ వ్యక్తిగత పరిచయాలున్నాయని వెల్లడించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ బ్రహ్మాదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. తన సవాల్ను స్వీకరించి సమాధానం చెప్పే దమ్ములేక కేసీఆర్, తన బానిసలతో ప్రెస్మీట్లు పెట్టించి అవమానకరమైన భాష మాట్లాడిరచారని మండిపడ్డారు.