రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం : అమెరికా
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా, అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. ఇప్పటికే చెప్పినట్టుగా రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడం లేదు. కానీ, ఉద్రిక్తతలు నివారణకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉంటుందూ కథనంపై కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు.
Tags :