యూపీఎస్సీ చైర్మెన్గా మనోజ్ సోనీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) చైర్మెన్గా మనోజ్ సోనీ ప్రమాణ స్వీకారం చేశారు. విద్యావేత సోనీ 2017, జూన్ 28వ తేదీన కమిషన్లో సభ్యుడిగా జాయిన్ అయ్యారు. ఇక యూపీఎస్సీ చైర్మెన్ హోదాలో ఆయన 2022, ఏప్రిల్ 5వ తేదీ నుంచి డ్యూటీ చేస్తున్నారు. కమిషన్లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ మనోజ్ సోనీ చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. యూపీఎస్సీ కమిషన్లో ఒక చైర్మెన్, పది మంది సభ్యులు ఉంటారు. అయితే ప్రస్తుతం యూపీఎస్సీలో అయిదుగురు సభ్యుల వేకన్సీ ఉంది. యూపీఎస్సీకి అపాయింట్ కావడానికి ముందు ఆయన మూడు సార్లు వైస్ ఛాన్సలర్గా చేశారు. గుజరాత్లోని అంబేద్కర్ వర్సిటీ, బరోడాలోని సయ్యాజిరావు వర్సిటీలకు వీసీగా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల ఎంపిక యూపీఎస్సీ ద్వారానే జరుగుతున్న విషయం తెలిసిందే.
Tags :