నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఇలాంటిది జరిగేది కాదు
తాను అధికారంలో ఉండి ఉంటే ఇజ్రాయెల్పై దాడి జరిగేది కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్టోబర్ 7న చోటుచేసుకొన్న ఆ మారణహోమంపై ప్రెసిడెంట్ జో బైడెన్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. హమాస్ ఆయన్ను లెక్కచేయదని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ను అప్రమత్తం చేశారు. ఆయన మాట్లాడలేరు. ఆయన విదేశాంగ విధానం భయానకం. బైడెన్ను హమాస్ గౌరవించదు. అందువల్లే ఈ దాడి జరిగింది. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటిది జరిగేది కాదు. ఇజ్రాయెల్కు బైడెన్ శ్రేయోభిలాషి అయ్యుంటే పరిస్థితి ఇలా ఉండదు అని విమర్శలు చేశారు.
Tags :