72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ప్లాట్ల అమ్మకం
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ (డీఎల్ఎఫ్) ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు ప్రీ-లాంచ్లో మంచి డిమాండ్ దక్కింది. కేవలం 72 గంట్లోనే రూ.7,200 కోట్ల విలువైన 1,113 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని డీఎల్ఎఫ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. గురుగ్రామ్లోని 76, 77 సెక్టార్లలో కొత్తగా నిర్మించబోయే డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ లగ్జరీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కు ఇటీవల ప్రీ-లాంచ్ నిర్వహించారు. నిర్మాణానికి ముందే ప్లాటన్నీ అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. కేవలం మూడు రోజుల్లోనే కస్టమర్లు వీటిని బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. మొత్తంగా 25 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్లను నిర్మించనున్నారు. 7 టవర్లలో 1,113 విలాసవంతమైన నివాసాలను నిర్మించనున్నట్లు కంపెనీ తెలిపింది. బుకింగ్ ధర రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కో కొనుగోలుదారు ఒక ప్లాట్ను మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇళ్లను కొనుగోలు చేసిన వారిలో 25 శాతం మంది ఎన్ఆర్ఐలేనని కంపెనీ వెల్లడించింది.