ASBL NSL Infratech

ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా... అధికారుల్లో మార్పు రావాలి

ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా... అధికారుల్లో మార్పు రావాలి

వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కుండువాలు  తీసి డ్యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి కనుసన్నలో నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైనా చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సెర్ప్‌ సీఈవో మురళీధర్‌ రెడ్డిని తక్షమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి  వద్దే ఫింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నియామావళి ప్రకారం పోలీసులు పని చేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :