ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా పనగడియా

16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా పనగడియా

నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్‌ రంజనమ్‌ పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ నోటిఫికేషన్‌ వెలువరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరి నియామకాలు జరిపినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. సభ్యుల పేర్లు విడిగా ప్రకటించనున్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల కాలావధి 2026 ఏప్రిల్‌ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది.  అందువల్ల 2025 అక్టోబరు 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :