ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్.. భారత్ లో 500 మందికి!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వర్క్ ఫోర్స్ను తగిస్తున్నట్లు తెలిపారు. ఇక, లేఆఫ్స్ పై త్వరలోనే ఉద్యోగులకు సమాచారం ఇస్తామని అన్నారు. అమెజాన్ కఠిన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని ఉద్యోగాలు కోల్పోగా, వారిలో 500 మంది భారతీయులు ఉన్నారు. తొలగింపునకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. తాజా లేఆఫ్స్ తో ఏడాదిలో ఇప్పటి వరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగానికి చెందినవారు ఉన్నారు.