గోవాలో రచ్చ చేస్తున్న సమంత...
అక్కినేని కోడలు సమంత పెళ్ళైన తర్వాత కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఆ మధ్య మాల్దీవులకి వెళ్లి బికినీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ఇప్పుడు గోవాలో చేస్తున్న రచ్చకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రతి ఏడాది గోవాకు వెళ్లే చై-సామ్ దంపతులు ఈసారి కరోనా ఉన్నా కూడా అక్కడకు వెళ్లారు. అహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతున్నారు.
సమంత తన భర్తతో పాటు బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ పొట్టి దుస్తులలో దిగిన ఫొటోలని ఇన్స్టాలో షేర్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి. ఇక్కడ ఉన్నప్పుడు పద్దతిగా కనిపిస్తున్న సమంత టూర్స్కు వెళితే అందాల విందు పంచుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్లో నటిస్తుండగా, ఇందులో విలన్ పాత్ర పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన సర్ప్రైజ్ రేపు న్యూ ఇయర్ గిఫ్ట్గా విడుదల కానుంది.