చరిత్ర సృష్టించిన రాజ్యసభ
రాజ్యసభకు మంచి రోజులు వచ్చాయేమో. ఎటువంటి ఆటంకాలు లేకుండానే రాజ్యసభలో సమావేశాలు జరిగాయి. జీరో అవర్ తో పాటు క్వశ్చన్ అవర్, ఇతర ఎజెండాలు కూడా అనుకున్నట్టుగానే జరిగాయి. దీంతో రాజ్యసభ చరిత్ర సృష్టించిందని చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ సమయంలో సభ్యులు హర్షాతిరేకాల మధ్య బల్లలు చరిచారు. సభ్యుల సహకారం బాగుందని, అందుకే సభ సజావుగా సాగిందని, అందుకే హౌజ్లో ఈ రికార్డును నెలకొల్పామని వెంకయ్య అన్నారు. భవిష్యత్తులోనూ సభ ఇలాగే సాగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా వివిధ కారణల వల్ల సభ సజావుగా సాగలేదు. ఇవాళ సభలో మొత్తం పది ప్రశ్నలకు చర్చించారు. జీరో అవర్ సబ్మిసన్తో పాటు మాజీ సభ్యుడు మరగబంధు మృతి పట్ట నివాళి అర్పించారు.
Tags :