జనవరి 4న 'లేడీ టైగర్' విడుదల
నయనతార నటించిన మలయాళ చిత్రం ఎలెక్ట్రా చిత్రాన్ని లేడీ టైగర్ పేరుతో ఈ నెల 4న తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత సురేశ్ దూడల. సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేశ్ సినిమా పతాకంపై విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, మనీషా కోయిరాల, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత సురేశ్ దూడల మాట్లాడుతూ నయనతార అభిమానులకు పండుగలాంటి చిత్రమిది. మనీషా కొయిరాల నటన, ప్రకాశ్రాజ్ ద్విపాత్రాభినయం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ఈ చిత్రానికి శ్యామ్ప్రసాద్ దర్శకుడు.
Tags :