న్యూఇయర్, సంక్రాంతి వేడుకలకు జనసేన దూరం
నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైతులు, కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఆదనంగా ఇచ్చారని.. ఆలాంటి రైతులు దైన్యంగా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తున్నారన్నారు. ఎప్పుడూ గడపదాటని మహిళలు సైతం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి రావడం దౌర్భాగ్యకమరని వ్యాఖ్యానించారు. భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉందని రైతులు తనకు వివరించినట్లు పవన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వేడుకలకు మనసు అంగీకరించడం లేదని అన్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్నరోజే తనకు నిజమైన సంక్రాంతి అని అన్నారు.
Tags :