ASBL NSL Infratech

2019లోనూ చంద్రబాబే సీఎం

2019లోనూ చంద్రబాబే సీఎం

బడ్జెట్‌లో దళిత, గిరిజన సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును దళిత, గిరిజన సంఘాల నేతలు సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. తమ సంక్షేమంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణానికి రూ.97.69 కోట్లు కేటాయించినందుకు గజమాలతో సన్నాచించారు.  2019లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని, ఎన్నికల్లో దళిత సంఘాలన్నీ ఆయనకే అండగా నిలుస్తాయని శివాజీ అన్నారు. ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ దళిత, గిరిజన అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :