ప్రపంచ తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం
హైదరాబాద్లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపచం తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉపరాష్ట్రపతిని కలిసి తెలుగు మహాసభల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అదేరోజు నుంచి ప్రారంభమవుతున్నందున వీలుచూసుకొని తప్పకుండా హాజరవుతానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్లు వేణుగోపాలాచారి చెప్పారు.
Tags :