ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కారెక్కిన మండవ వెంకటేశ్వరరావు

కారెక్కిన మండవ వెంకటేశ్వరరావు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో మండవ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, విద్యాశాఖల మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

 

Tags :