ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ రిమోట్ మోడీ చేతుల్లో ఉంది

తెలంగాణ రిమోట్ మోడీ చేతుల్లో ఉంది

ఎన్నికల్లో మోదీ, కేసీఆర్‌ కలిసి డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిమోట్‌ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. బీజేపీతో నిజంగా పోరాడుతోంది కాంగ్రెస్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా బహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. దేశంలోని దొంగలకు ప్రధాని మోదీ చైకీదార్‌గా ఉన్నారు. 

ప్రతి పేదవాడి ఖాతాలో రూ.72వేలు వేస్తాం అని రాహుల్‌ హామీ ఇచ్చారు. నల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్నారు. రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదు. దీనికి తోడు గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ తీసుకొచ్చారు. దీంతో పేదలు, మధ్యతరగతి, చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీకి ఇక్కడి సీఎం కేసీఆర్‌ మద్దతు పలికారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిమోట్‌ మోదీ చేతిలో ఉంది. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు. రఫేల్‌ కుంభకోణంపై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించం లేదు అని రాహుల్‌ ప్రశ్నించారు.

 

Tags :