ASBL NSL Infratech

నాటా అవార్డు ఇన్ జర్నలిజంకు ఎంపికైన కొమ్మినేని

నాటా అవార్డు ఇన్ జర్నలిజంకు ఎంపికైన కొమ్మినేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) అవార్డు ఇన్‌ జర్నలిజం-2023కు ఆంధ్రప్రదేశ్‌ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మ న్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్‌ నగరంలోని డల్లాస్‌ కన్వెక్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్‌ఆర్‌ లైవ్‌  షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

 

 

Tags :