ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్రిక్కిరిసిపోయిన మొతేరా స్టేడియం

క్రిక్కిరిసిపోయిన మొతేరా స్టేడియం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ దంపతులకు ఘనస్వాగతం పలికేందుకు అహ్మదాబాద్‍ నగరంలోని  మొతేరా స్టేడియానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మొతేరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్‍ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన జనంతో మొతేరా స్టేడియం కిక్కిరిసి పోయింది. ట్రంప్‍, మోదీల ఉపన్యాసాన్ని వినేందుకు గుజరాతీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అరుణ్‍ హరియానీ అనే యువకుడు భారతీయ జాతీయ జెండా రంగులను శరీరం అంతా పెయింట్‍ చేసుకొని జాతీయ పతకాన్ని,  ప్లకార్డులను చేతబట్టుకొని స్టేడియానికి వచ్చారు. ‘యే దోస్తీ హమ్‍ నహీన్‍ తోడేంగే’ అంటూ ప్లకార్డు పట్టుకొని వచ్చిన యువకుడు అందరినీ ఆకట్టుకున్నారు.

 

Tags :