మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం
మల్కాజ్గిరి లోక్సభ ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 6270 ఓట్ల మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రేవంత్కు ఈ ఫలితం ఊరట నిచ్చింది. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు.
Tags :