ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పోలాండ్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

పోలాండ్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

టీఆర్‌ఎస్‌ పోలాండ్‌ శాఖ ఆధ్వర్యంలో వార్సా నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 64వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ పోలాండ్‌ శాఖ ముఖ్య నాయకుడు మహేష్‌ కుమార్‌ ఊరుగొండ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'జై కెసిఆర్‌ ....కేసీఆర్‌ గారి నాయకత్వం వర్ధిల్లాలి..' అని నినాదాలు చేశారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో లండన్‌లో టీఆర్‌ఎస్‌ శాఖలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నానని, మళ్లీ ఇలా పోలాండ్‌లో టీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మహేశ్‌కుమార్‌ అన్నారు. విదేశాల్లోని ప్రవాసులకు టీఆర్‌ఎస్‌ తరపున సేవచేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌కు, తమను ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకు కత్ఞతలు తెలిపారు. పోలాండ్‌ వచ్చి మరీ తెరాస శాఖను ఏర్పాటు చేసి తమను ప్రోత్సహించిన ఎన్నారై తెరాస కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలకు ధన్యవాదాలు చెప్పారు. ఎప్పటికప్పుడు సలహాలు సూచనలిస్తున్న ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలంకు, శ్యామ్‌ బాబుకు కూడా కతతలు తెలిపారు.

మహేష్‌ కుమార్‌ ఊరుగొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు జగన్‌, కార్తీక్‌, మనీష్‌, ఫణి, సునీత్‌, అజయ్‌, సందీప్‌, మోను,సూర్య, లిఖిత్‌, శ్రీనాథ్‌, హరీష్‌, నవీన్‌, గోకుల్‌, బుజ్జి బాబు, గోవర్ధన్‌, బలరాం తదితరులు పాల్గొన్నారు.

 

Tags :