ASBL NSL Infratech

నాటా సభలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి

నాటా సభలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి

నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మూడు రోజుల పాటు నిర్వహించే సదస్సులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూధనరెడ్డి హాజరుకానున్నరు. ఈ మేరకు ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు మూడు రోజుల పాటు సభలను నిర్వహించటం ఆ సభలకు భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్టాల నుంచి ప్రతి ఏటా ఆహ్వానించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించటం ఆనవాయిత.  ఈ నేపథ్యంలో గతంలో కూడా శ్రీకాళహస్తి శాసససభ్యుడు  బియ్యపు మధుసూదనరెడ్డి నాటా సభలకు హాజరయ్యారు.  సుమారు 15 వేల మంది భారతీయులు నాటా సభలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సభలు డల్లాస్‌లో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సరిగే సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ప్రతినిధులను ఆహ్వానించారు. ఇక్కడ నిర్వహించే సోషల్‌ మీడియా సమావేశంలో కూడా శాసనసభ్యుడు బియ్యపు మధుసూధనరెడ్డి పాల్గొనన్నుట్లు తెలిసింది.

 

 

Tags :