ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

16 సీట్లతో ప్రధాని అవుతారా? : అమిత్ షా

16 సీట్లతో ప్రధాని అవుతారా? : అమిత్ షా

ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. శంషాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ 16 స్థానాల్లో తమను గెలిపించాలని టీఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ దేశ ప్రధాని కాగలుగుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన సృష్టం చేశారు.  తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ చేసిందేమీలేదని విమర్శించారు. దేశం మొత్తం మోదీ నామస్మరణ వినిపిస్తోందని, మోదీయే ప్రధాని కావాలలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇటు టీఆర్‌ఎస్‌పైనా, అటు కాంగ్రెస్‌ పైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Tags :