షర్మిల గురువింద నీతుల పై ఫైర్ అవుతున్న నెటిజన్లు ..
గత ఎన్నికల సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం సాగించిన షర్మిల ఈసారి ఎన్నికల్లో మిస్ ఫైర్ అయిన బాణంలో జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ తన తండ్రి లాంటివాడు అంటూ జగన్ కాస్త ఎమోషనల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన షర్మిల గతంలో బొత్స తన తండ్రి వైఎస్ఆర్ ని తిట్టిపోశారని.. ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న వారంతా ఒకప్పుడు తన తండ్రికి వ్యతిరేకంగా ఉన్న వారే అని వ్యాఖ్యానించారు.
తన తల్లి విజయమ్మను సైతం అవమానించిన బొత్స ఇప్పుడు జగన్ కు తండ్రి సమానం ఎలా అవుతాడు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ కాంగ్రెస్ ను కాదు అని బయటకు వచ్చిన సమయంలో బొత్స అతనిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మాట నిజమే.. కానీ ఆ తర్వాత జగన్ కోసం అతను కాంగ్రెస్ ని వదిలిపెట్టి ఒంటరి పోరాటం చేశాడు. జగన్ కోసం పని చేస్తూ.. అహర్నిశలు శ్రమించి వైసీపీని ఉత్తరాంధ్రలో బలపరిచారు. ఒకప్పుడు జగన్ తో కలిసి పని చేసిన షర్మిలకు బొత్స ఎలాంటి వాడో తెలియకుండా ఉంటుందా. మరి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ను తిట్టిపోయలేదా.. రేవంత్ రెడ్డిని విమర్శించలేదా.. మరి ఇప్పుడు అదే పార్టీలో ఎలా ఉంటున్నారు. షర్మిల చేస్తే అది మంచి కోసం.. కానీ అదే ఆమె అన్న జగన్ చేస్తే అది పబ్లిసిటీ కోసం. షర్మిల మాట్లాడే ఈ గురివింద లాజిక్ ఎవరికి అంతుచిక్కడం లేదు. మొదట్లో షర్మిల సభలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఉండడం లేదు.. ఆమె మాటలను బట్టి చెప్పేది ఒకటి ..చేసేది ఒకటి అన్న విషయం అందరికీ అర్థమైపోతుంది. నెటిజన్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి సోషల్ మీడియా వేదికగా షర్మిలపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.