నా తండ్రి లాంటి వ్యక్తి.. స్టేజీపై ఎమోషనల్ అయిన జగన్..
ఎన్నికల దగ్గర పడుతుండడంతో జగన్ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలలో మమేకం అవుతూ.. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోపక్క మేము సైతం సిద్ధం సభలు నిర్వహిస్తూ ప్రతిపక్షాల ఆరోపణలకు తగిన జవాబులు ఇస్తున్నారు. రీసెంట్ గా మేము సైతం వేదికపై పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తూ వారి మంచితనం గురించి వివరిస్తున్నారు జగన్. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను ప్రతిపక్షాలు వికృతార్థాలతో వైరల్ చేస్తున్నాయి. జగన్ తన నేతలతో.. కార్యకర్తలతో.. తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ వారు సౌమ్యలు ..మంచివారు అని చెప్పే విషయాలను కూడా వెటకారంగా సృష్టిస్తున్నారు ఎల్లో మీడియా వారు.
అయితే తాజాగా మంత్రి బొత్స గురించి జగన్ మాట్లాడిన మాటలు.. దానికి ఆయన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి. జగన్ తన వారికి ఎంతో మర్యాద ఇస్తారు.. కుటుంబ సభ్యులు లాగా చూసుకుంటారు అన్న విషయానికి ఇదొక నిదర్శనంగా మిగులుతోంది. బొత్స తనకు తండ్రి లాంటివారు అన్న జగన్ అతన్ని ఎప్పుడూ అన్నా అంటుంటాను అని స్టేజీపై అన్నారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయిన బొత్స జగన్ చేయి పట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో ఆ ఇద్దరినీ చూసిన ఎవరికైనా వారి మధ్య ఉన్న అనుబంధం అర్థం అవుతుంది. జగన్ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చే విలువ అలాంటిది అని వైసీపీ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.