వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు..
ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజుకో కొత్త పరిణామం మనం గమనిస్తున్నాం. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న నాయకులు ప్రత్యర్ధులపై మాటలతో దాడి చేస్తున్నారు. నామినేషన్ల పర్వం కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టో విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. రేపు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఎల్లుండి అంటే ఈనెల 26న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అవలంబిస్తున్నారు. ఇక వాటిని అలాగే కొనసాగిస్తూ.. ఆచరణకు సాధ్యమయ్యేటటువంటి మరికొన్ని హామీలను.. ప్రజాకర్షక పథకాలను ఈ మేనిఫెస్టోలో పొంది పరిచారట. ఈసారి కేవలం అధికారంలోకి రావడమే కాక వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్న జగన్ దానికి అనుగుణంగానే మేనిఫెస్టో ను సిద్ధం చేశారని తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు ,అభిమానులు ఈ మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.