జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన వెనిగండ్ల రాము..
బాబు షూరిటీ భవితకు గ్యారంటీ ప్రోగ్రాం లో భాగంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము ఈరోజు గుడివాడలోని 32వ వార్డులో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల అరాచక పాలనలు రాష్ట్రంలోని గ్రామాలు వార్డులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు తప్ప మరొకటి కనిపించడం లేదు అని ఆయన అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ,రోడ్లు ఇంత దారుణంగా తాను ఎప్పుడూ చూడలేదని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాను నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా టీడీపీ హయాంలో వేసిన రోడ్లే కనిపిస్తున్నాయని కొత్తగా వేసింది ఒకటి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈనాడు ప్రజలు శుభ్రమైన నీరు, రోడ్లు లాంటి కనీస వసతుల కోసం అల్లాడిపోతున్నారని. ఇదంతా రూలింగ్ పార్టీ గొప్పతనమని అన్నారు. పథకాలు ఇస్తున్నాను కాబట్టి ఇవేమీ అవసరం లేదు అన్న భావనలో జగన్ సర్కారు ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు రూలింగ్ టైంలో పథకాలతో పాటు ప్రజలకు పురోగతి కూడా ఉంది అని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేశారు.