అమెరికాలో భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ క్యాంపస్లో చోటు చేసుకున్న నిరసనల్లో ఇద్దరు విద్యార్థులను అందుపులోకి తీసుకున్నారు. వారిలో భారత సంతతికి చెందిన విద్యార్థిని ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె పేరు అచింత్య శివలింగన్. ప్రిన్స్టన్లో మాస్టర్స్ చేస్తున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి పేరు హస్సన్ సయ్యద్. నిరసనకారులు గురువారం తెల్లవారుజామున క్యాంపస్లో టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి అరెస్టు చోటుచేసుకుందని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. యూనివర్సిటీ పాలసీని ఉల్లంఘిస్తూ టెంట్లు ఏర్పాటు చేసినందున చర్యలు తీసుకున్నట్లు విద్యా సంస్థ ప్రతినిధి వెల్లడిరచారు. న్యూయ్యార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలకు వ్యాపించాయి.