ASBL NSL Infratech

లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతాను.. కంగనా రనౌత్

లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతాను.. కంగనా రనౌత్

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు తన ఘాటైన విమర్శలతో సంచలనం సృష్టించే నటి కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత సినిమా పరిశ్రమను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టంగా తెలియపరిచారు. తను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు ఇంకా చాలా పెండింగ్ ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచి పెట్టే అవకాశం లేదు అని కంగనా అన్నారు. ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని మాటలు పంచుకున్నారు. అయితే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగాలి అనుకునే ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తన అస్త్రంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఎప్పటి నుంచో కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న మండి నియోజకవర్గం లో ఈసారి గెలవాలి అనే ఉద్దేశంతో బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా కంగనాను బరిలోకి దింపింది. అయితే ఆమె తాజా వ్యాఖ్యల కారణంగా గట్టి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని విశ్లేషకుల అంచనా. మరి కంగనా ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :