ఆయన ఆధ్వర్యంలోనే ఏపీ అభివృద్ధి ..ప్రవాస భారతీయ మహిళలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. వాషింగ్టన్లోని వర్జీనియాలో వీరు సమావేశమయ్యారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి. విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆయన ఆధ్వర్వంలోనే రాష్ట్రాభివృద్ది సాధ్యం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళనగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి మా వంతు కృషిగా స్వస్థలాలకు వెళ్లి ప్రజలు, బంధువులను చైతన్యపరుస్తాం. టీడీపీ విజయానికి కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నవ అనిత, పూసల సింధు, పారుపల్లి శాంతి, మండవ నీలిమ, పాలడుగు సాయిసుధ, గోరంగ్ల మంజూష, తదితరులు పాల్గొన్నారు.