ASBL NSL Infratech

హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి నియామకం

హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి నియామకం

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌ రావు అలియాస్‌ జె.శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ ఆమోదం తెలపగా, వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించనున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెల్లడిరచారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :