సీజేఐ డీవై చంద్రచూడ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐని ముఖ్యమంత్రి రేవంత్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Tags :