ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌  ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు, నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్‌ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్‌ నమోదైంది.  కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ఓటు వేశారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌ గౌడ్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :