ASBL NSL Infratech

ఏపీలో మరో ఇద్దరు ఐపీఎస్ లపై వేటు

ఏపీలో మరో ఇద్దరు ఐపీఎస్ లపై వేటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల సమయం లో మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. సీనియర్‌ ఐపీఎస్‌లైన ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ  చేసింది. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేకుండా పోస్టింగ్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదరు అధికారులు తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ప్రస్తుతమున్న విధుల  నుంచి తక్షణమే తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ముగ్గురు చొప్పున పేర్లతో ఐపీఎస్‌ల జాబితా పంపాలని సూచించింది. వియవాడలో ఇటీవల మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాయి దాడి ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :