11 వ సీటు కూడా వస్తుంది.. కూటమి లెక్కల పై పురందేశ్వరి స్టేట్మెంట్..
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో కూటమికి సంబంధించి పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదట పది సీట్లకు ఒకే చెప్పినా బీజేపీ మెల్లిగా సీట్ కౌంట్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు వాళ్లు 11వ ఎమ్మెల్యే సీట్ ని కూడా ఆశిస్తున్నారు. మరోపక్క వలస వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని పార్టీలో ఉన్న కొందరు చేస్తున్న కామెంట్స్ పై పురందేశ్వరి స్పందించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పాతవారు, కొత్తవారు అందరూ సమానమేనని పేర్కొన్న పురందేశ్వరి.. రాష్ట్రంలో బీజేపీ కు మరిన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.బీజేపీ కు 11వ ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని.. అయితే ఆ సీటు ఎక్కడి నుంచి వస్తుంది అనేది త్వరలో తెలుస్తుందని ఆమె అన్నారు. ఇక బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భవిష్యత్తును పార్టీ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నాము అని ఆరోపించడం సరికాదు అని అన్నారు. టికెట్లు ఇవ్వడం అనేది ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ ,సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది అని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా తోలుత బీజేపీ కు 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు దక్కిగా బీజేపీ మరొక ఎమ్మెల్యే సీటును కోరుతోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.